Tuesday, 6 July 2021

అమర్‌నాథ్‌ యాత్ర

 అమర్‌నాథ్‌ యాత్ర


దేశంలోని జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో అమర్‌నాథ్‌ పర్వతంపై ఉన్న అమర్నాథ్‌ గుహలు హిందువులకు చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. మహాదేవుడికి అంకితమైన ఈ క్షేత్రం 5,000 సంవత్సరాలకు పైగా ఉన్న ఆలయం. ప్రధాన అమర్‌నాథ్‌ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు ఆకృతి ఉంటుంది. ఇది మే నుంచి ఆగస్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయంలో అత్యధిక ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలోనే శివుడు తన దైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించారు. మరో రెండు మంచు ఆకారాలు పార్వతి, గణపతివని నమ్ముతారు.


🌺🌺🌺 స్థల పురాణం 🌺🌺🌺


అమరనాథుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీదేవి ఈశ్వరుడితో "నాథా! నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది'' అని అడిగింది. ఈశ్వరుడు "పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను'' అని బదులిచ్చాడు. పార్వతీ దేవి ''నాథా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నావు ఇది ఎలా సాధ్యం?'' అని అడిగింది. ఈశ్వరుడు "పార్వతీ! ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణికోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి'' అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈశ్వరుడు అమరనాథ్ గుహను ఎంచుకున్నాడు. పహల్‌ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్‌ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్‌ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాల జంట ఈ రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయట...

 

పురాతన ఇతిహాసాలలో మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరస్సును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్‌ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్‌ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణకాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.


మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...